Monday, April 29, 2024

రాజమహేంద్రవరంలో రంగ్ దే టీమ్

వెంకీ అట్లూరి దర్శకత్వంలో యంగ్ హీరో నితిన్ ప్రధానపాత్రలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న చిత్రం రంగ్ దే. ఈ చిత్రంలో నితిన్ సరసన మహానటి ఫేమ్ కీర్తి సురేష్ నటించింది. సితార ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై సూర్యదేవర నాగ వంశీ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. కాగా ఈ చిత్రం ఈ నెల 26వ తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఇక ఈ సినిమా ప్రమోషన్ లో భాగంగా గా చిత్ర యూనిట్ రాజమహేంద్రవరంలో సందడి చేయనున్నారు.

ఈ విషయాన్ని చిత్ర దర్శకుడు వెంకీ అట్లూరి ట్విట్టర్ వేదికగా ప్రకటించారు. ఈ కార్యక్రమంలో హీరో నితిన్, హీరోయిన్ కీర్తి సురేష్, మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీ ప్రసాద్ తో పాటు మరికొంత మంది చిత్ర యూనిట్ సభ్యులు పాల్గొనబోతున్నారు. ఇక ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి విడుదలైన పాటలు, లుక్స్ సినిమాపై అంచనాలను మరింత పెంచిన సంగతి తెలిసిందే.

Advertisement

తాజా వార్తలు

Advertisement