Thursday, April 25, 2024

తొలి వన్డే భారత్ గెలవడంపై ఫన్నీ ట్రోల్స్

సాధారణంగా ఇటీవల కాలంలో ఏ సిరీస్ తీసుకున్నా టీమిండియా ఫస్ట్ మ్యాచ్ ఓడిపోవడం.. సిరీస్ గెలవడం జరుగుతున్నాయి. ఆస్ట్రేలియాలో టీ20 సిరీస్, టెస్టు సిరీస్, స్వదేశంలో ఇంగ్లండ్‌తో టెస్టు సిరీస్, టీ20 సిరీస్ ఇందుకు సాక్ష్యాలు. ఆయా సిరీస్‌ల్లో కోహ్లీ సేన ఫస్ట్ మ్యాచ్ ఓడి సిరీస్‌లు తమ ఖాతాలో వేసుకుంది.

ఇందుకు అనుగుణంగానే మంగళవారం ఇంగ్లండ్‌తో జరిగిన తొలి వన్డేలో ఒక దశలో భారత్ ఓటమి ఖాయం అనుకున్నారు. బెయిర్‌స్టో అలా విజృంభించాడు మరి. కానీ బౌలర్ల ప్రతిభతో చివరకు ఇండియా మ్యాచ్ గెలిచేసింది. అయితే ఈ మ్యాచ్‌పై సోషల్ మీడియాలో ఓ రేంజ్‌లో మీమ్స్ వైరల్ అవుతున్నాయి. అవేంటో మీరూ చూడండి.

Advertisement

తాజా వార్తలు

Advertisement