Friday, May 3, 2024

రామ్ లింగుస్వామిలు సెట్స్ పైకి వచేస్తున్నారు !

ఎనర్జిటిక్ స్టార్ రామ్ ఇస్మార్ట్ శంకర్ సినిమాతో సూపర్ డూపర్ హిట్ అందుకొని ఫామ్ లోకి వచ్చాడు. అలాగే ఇటీవల రెడ్ సినిమాతో ఫ్యాన్స్ లో ఉత్సాహాన్ని మరింత పెంచాడు. అయితే ఇటీవలే స్టార్ డైరెక్టర్ లింగుస్వామి తో సినిమా చేయబోతున్నట్లు అనౌన్స్ చేశాడు రామ్. ఇక ఈ సినిమాకు సంబంధించి అనౌన్స్మెంట్ వచ్చినప్పటి నుంచి కూడా అంచనాలు పెరుగుతూ వస్తున్నాయి. ఫ్యాన్స్ కూడా ఎంతో ఆసక్తిగా ఈ సినిమా కోసం ఎదురు చూస్తున్నారు.

కాగా ఈ సినిమా షూటింగ్ స్టార్ట్ చేయడానికి ముహూర్తం ఫిక్స్ చేసినట్లు తెలుస్తోంది. జూలై రెండవ వారం నుంచి ఈ సినిమా షూటింగ్ స్టార్ట్ చేయబోతున్నట్టు సమాచారం. ఇక ఈ సినిమాను తెలుగు తమిళ భాషల్లో ఏక కాలంలో బై లాంగువల్ సినిమాగా తెరకెక్కనుంది. అలాగే దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తుండగా… ఉప్పెన హీరోయిన్ కృతి శెట్టి హీరోయిన్ గా నటించబోతోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement