Sunday, April 28, 2024

వనపర్తి జిల్లాలో విషాదం.. మిద్దె కూలి సర్పంచ్‌ మృతి

వనపర్తి జిల్లా రేవల్లి మండలం బండరావిపాకుల గ్రామంలో విషాదం చోటు చేసుకుంది. ప్రమాదవశాత్తూ ఇల్లు కూలిన సంఘటనలో సర్పంచ్‌ సహా ఆమె మనువడు మృతి చెందారు. మంగళవారం రాత్రి గ్రామ సర్పంచ్‌ లక్ష్మమ్మ (51), ఆమె మనవడు యోగేశ్వర్‌ (7) రాత్రి సమయంలో ఒక్కసారిగా మట్టి మిద్దె కూలిపోయింది. దీంతో ఇద్దరు అక్కడికక్కడే మృత్యువాతపడ్డారు. సర్పంచ్‌ మృతిపై రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి విచారం వ్యక్తం చేశారు. మృతుడి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు. ప్రభుత్వపరంగా బాధిత కుటుంబాన్ని అన్ని విధాలుగా అండగా ఉంటామని వెల్లడించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement