Friday, May 3, 2024

మాల్దీవుల‌కు వెళ్తోన్న రామ్ చ‌ర‌ణ్.. ఉపాస‌న‌

త్వ‌ర‌లో త‌ల్లిదండ్రులుగా మార‌నున్నారు మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్‌..ఉపాస‌న‌. ఈ నేప‌థ్యంలో వీరిద్ద‌రూ విహార‌యాత్ర‌లు చేస్తున్నారు.ఉపాసనతో కలిసి మాల్దీవులకు వెళుతూ హైదరాబాద్ ఎయిర్ పోర్టులో దర్శనమిచ్చారు. రామ్ చరణ్, ఉపాసన కారు దిగి లాంజ్ వైపు వెళుతుండగా కెమెరాలు ఈ జోడీని క్లిక్ మనిపించాయి. భార్య‌కోసం ఆయ‌న త‌న స‌మ‌యాన్ని కేటాయిస్తున్నారు చ‌ర‌ణ్. కాగా చ‌ర‌ణ్ నిన్న మొన్న‌టి వరకు ఫుల్ బిజీగా గడిపారు. ఆస్కార్ నేపథ్యంలో ఆర్ఆర్ఆర్ కోసం సుదీర్ఘ సమయం అమెరికాలో ఉండిపోయిన రామ్ చరణ్ ఇటీవలే స్వదేశం తిరిగొచ్చారు. అటు, శంకర్ దర్శకత్వంలో సినిమా కూడా ఓ షెడ్యూల్ పూర్తి చేసుకుంది. దాంతో, లభించిన విరామాన్ని సద్వినియోగం చేసుకునేందుకు రామ్ చరణ్ తన అర్ధాంగి ఉపాసనతో కలిసి విహారయాత్రకు బయల్దేరారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement