Tuesday, May 7, 2024

జగన్ పాలనలో తీవ్ర సంక్షోభంలో వ్యవసాయ రంగం.. యనమల

జగన్ నాలుగేళ్ల పాలనలో వ్యవసాయ రంగం తీవ్ర సంక్షోభంలో ఉందని మాజీ మంత్రి, టీడీపీ నేత యనమల రామకృష్ణుడు అన్నారు. ఏపీ సీఎం జగన్ వ్యాఖ్యలపై య‌న‌మ‌ల‌ స్పందించారు. ఆహార ధాన్యాల దిగుబడి పెరిగిందని జగన్ చెప్పడం మోసం చేయడమేనని విమర్శించారు. ఏ పంటకు గిట్టుబాటు ధర లేదన్న ఆయన క్రాప్ హాలిడేస్ ప్రకటించే పరిస్థితి వచ్చిందంటూ ధ్వజమెత్తారు. రాష్ట్రంలో వ్యవసాయ సాగు విస్తీర్ణం తగ్గితే వృద్ధిరేటు ఎలా పెరిగిందో సమాధానం చెప్పాలని యనమల డిమాండ్ చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement