Saturday, May 4, 2024

ఆచార్య శాటిలైట్ రైట్స్ పై వెనక్కి తగ్గిన నిర్మాతలు

కొరటాల శివ దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి హీరోగా తెరకెక్కుతున్న చిత్రం ఆచార్య. భారీ అంచనాల మధ్య తెరకెక్కుతున్న ఈ సినిమాలో చిరంజీవి సరసన కాజల్ అగర్వాల్ నటిస్తోంది. అలాగే రామ్ చరణ్ కూడా ఈ సినిమాలో నటిస్తున్నారు. రాంచరణ్ సరసన పూజా హెగ్డే నటిస్తోంది. అయితే ఈ సినిమా శాటిలైట్ రైట్స్ కు పెద్ద పెద్ద ఆఫర్లు వచ్చాయి. కానీ దర్శకనిర్మాతలు అంతకన్నా పెద్ద మొత్తంలో డిమాండ్ చేస్తుండడంతో ఛానల్స్ షాక్ తింటున్నాయి. అయితే ఎన్నిసార్లు ప్రయత్నించినప్పటికీ శాటిలైట్ రైట్స్ అమ్ముడు పోకపోవడంతో దర్శకనిర్మాతలు ఒక అడుగు కిందికి దిగినట్లు తెలుస్తోంది.

ప్రస్తుతం ఉన్న సమయంలో పెద్ద మొత్తంలో డిమాండ్ చేయకుండా రీజనబుల్ ప్రైస్ కు సాటిలైట్ రైట్స్ అమ్మాయిలని నిర్ణయించుకున్నారట. అయితే తాజా సమాచారం ప్రకారం ప్రముఖ టీవీ ఛానల్ స్టార్ మా ఆచార్య శాటిలైట్ రైట్స్ ని కొనుక్కునేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఇక రామ్ చరణ్, మ్యాట్ని ఎంటర్టైన్మెంట్ వారు సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్న సంగతి తెలిసిందే.

Advertisement

తాజా వార్తలు

Advertisement