Saturday, April 27, 2024

నా పేరు సూర్య డైరెక్టర్ తో నితిన్

హిట్లు, ఫ్లాపులతో సంబంధం లేకుండా వరుసగా సినిమాలు చేస్తున్నాడు టాలీవుడ్ యంగ్ హీరో నితిన్. ఇటీవల రంగ్ దే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన నితిన్ మాస్ట్రో సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా తరువాత మరో సినిమాను కూడా స్టార్ట్ చేయడానికి రెడీగా ఉన్నాడు నితిన్. ఈ సినిమా వక్కంతం వంశీ దర్శకత్వంలో చేయబోతున్నట్లు తెలుస్తోంది.

వక్కంత వంశీ మొదట అల్లు అర్జున్ హీరోగా నా పేరు సూర్య సినిమా చేశాడు. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టింది. అయితే తాజాగా వంశీ నితిన్ కు స్క్రిప్ట్ ను వినిపించారట. అంతేకాకుండా ఈ సినిమాతో హిట్ కొడతాననే నమ్మకంతో కూడా వంశీ ఉన్నారట. కరోనా తగ్గిన తర్వాత ఈ ఏడాది చివరలో ఈ సినిమాను ప్రారంభించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement