Wednesday, April 24, 2024

చంద్రబాబుకు కరోనా కన్నా భయంకరమైన లక్షణాలు: కొడాలి నాని

కరోనా కట్టడికై ప్రభుత్వం సమర్థవంతమైన చర్యలు చేపడుతోందని మంత్రి కొడాలి నాని స్పష్టం చేశారు. ఏపీలో ఒక్క రోజులో 6 లక్షల మందికి టీకాలు వేశామని, మరిన్ని వ్యాక్సిన్లు కావాలని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ ఇప్పటికే కేంద్రానికి రెండు సార్లు లేఖ రాశారని గుర్తు చేశారు. రోజుకు 10 లక్షల మందికి వ్యాక్సిన్ వేసేందుకు సిద్దంగా ఉన్నామన్నారు. ప్రభుత్వంపై జూమ్‌ యాప్‌ లో చంద్రబాబు విషప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. ప్రజలను భయబ్రాంతులకు గురిచేస్తున్న చంద్రబాబుపై కేసు పెట్టాలని పేర్కొన్నారు. ఎవరు చనిపోయినా కరోనాతోనే చనిపోయారని బాబు విష ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. కర్నూలులో ఎన్‌440కే వైరస్ ఉందని చంద్రబాబు విష ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రాన్ని సర్వనాశనం చేసేందుకు సీబీఎన్‌ 420 అనేది నారావారిపల్లెలో పుట్టిందని వ్యాఖ్యానించారు. చంద్రబాబుకు పిచ్చి పరాకాష్టకు చేరుకుందని చంద్రబాబు విమర్శించారు. రాష్ట్రంలో ఎన్నికలు పెట్టి కరోనా ఉధృతి కారణమయ్యారంటూ ఆరోపించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement