Wednesday, May 15, 2024

నా ఫొటోలు మార్ఫింగ్ చేశారు.. పోలీసుల‌కి క‌రాటే క‌ళ్యాణి కంప్లైంట్

పోలీసుల‌ని ఆశ్ర‌యించింది సీనియ‌ర్ న‌టి క‌రాటే క‌ళ్యాణి. సోషల్ మీడియాలో తన ఫొటోలను మార్ఫింగ్ చేసి తన పరువుకు భంగం కలిగిస్తున్నారంటూ పోలీసులను ఆశ్రయించారు. తన పాత ఫోటోలు, పాత సినిమా సన్నివేశాల ఫోటోలు ఇప్పుడు బయటకి తీసి వాటిని మార్ఫింగ్ చేసి వైరల్ చేస్తున్నారంటూ హైదరాబాద్ సీసీఎస్ పోలీసులకు కల్యాణి పిర్యాదు చేశారు. దాంతో, పోలీసులు 469,506,509 ఐపీసీ సెక్షన్స్ కింద కేసులు నమోదు చేశారు. ఇలా తన ఫొటోలు వైరల్ చేస్తున్న చేస్తున్న లలిత్ కుమార్, అతని టీమ్ మీద కేసులు చేసినట్టు సమచారం. తన ఎదుగుదల తట్టుకోలేక సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేస్తున్న కల్యాణి ఆరోపించింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement