Monday, April 29, 2024

CM KCR : నిమ్స్ కొత్త బ్లాక్ కు భూమిపూజ.. న్యూట్రిషన్ కిట్ల పంపిణీకి శ్రీకారం

హైదరాబాద్‌లోని నిమ్స్‌ దశాబ్ది బ్లాక్‌ నిర్మాణానికి సీఎం కేసీఆర్‌ భూమిపూజ చేశారు. అనంతరం మాతాశిశు సంరక్షణ కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన కేసీఆర్‌ న్యూట్రిషన్‌ కిట్లు పంపిణీని ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ఆరుగురు మహిళలకు ముఖ్యమంత్రి కేసీఆర్‌ న్యూట్రిషన్‌ కిట్లను పంపిణీ చేశారు.


గర్భిణుల్లో పోషకాహార లోపం, రక్త హీనత లేకుండా కాపాడేందుకు కేసీఆర్‌ కిట్‌కు అనుబంధంగా వీటిని అందజేస్తున్నారు. మొదటి దశలో ఆదిలాబాద్‌, భద్రాద్రి కొత్తగూడెం, జయశంకర్‌ భూపాలపల్లి, జోగులాంబ గద్వాల, కామారెడ్డి, కుమ్రంభీం ఆసిఫాబాద్‌, ములుగు, నాగర్‌కర్నూల్‌, వికారాబాద్‌ జిల్లాల్లో ప్రారంభించారు. బిడ్డ పుట్టినప్పుడు కేసీఆర్‌ కిట్‌ ఇచ్చినట్లుగానే, బిడ్డ కడుపులో ఉండగానే కేసీఆర్‌ న్యూట్రిషన్‌ కిట్స్‌ ఇస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement