Thursday, May 9, 2024

చంద్రబాబు చరిత్ర హీనుడు : మంత్రి పెద్దిరెడ్డి

అనంతపురం, ప్రభ న్యూస్ బ్యూరో : చంద్రబాబు చరిత్ర హీనుడు, అధికారం పొందడానికి అందరి సహకారం కోసం పాకులాడుతున్నాడు అని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి విమర్శించారు. బుధవారం అనంతపురంలో అమ్మ డైరీ ప్రారంభోత్సవానికి వచ్చిన మంత్రి మీడియాతో మాట్లాడారు. ఎన్ని రాజకీయ పార్టీలు ఒక్కటైన, వైఎస్సార్ కాంగ్రెస్ ఒంటరిగానే పోటీ చేస్తుందని తెలిపారు. 2014లో టీడీపీ మిగతా రాజకీయ పార్టీలు కలిసి పోటీ చేశాయని గుర్తు చేశారు. మళ్లీ 2024లో కలిసి పోటీ చేస్తారో ఏమో అని అనుమానం వ్యక్తం చేశారు. మేము ప్రజలకు మంచి చేశాం, సీఎం వైఎస్ జగన్ సుపరిపాలన అందిస్తున్నట్లు తెలిపారు. చంద్రబాబు రాజకీయంగా శక్తి హీనుడు అయ్యాడు కాబట్టి అందిరి సహకారం అవసరం అన్నారు. రాయలసీమకు ఎవరు ఎంత మేలు చేసారో ప్రజలకు బాగా తెలుసు అని పేర్కొన్నారు. అమ్మ డైరీ ద్వారా అనంతపురం జిల్లా ప్రజలకు ముఖ్యంగా మహిళలకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement