Friday, April 26, 2024

తెలుగు ఫిల్మ్ ఛాంబర్ హాలులో ఎగ్జిబిటర్స్ అసోసియేషన్ ప్రతినిధుల భేటీ

తెలుగు ఫిల్మ్ ఛాంబ‌ర్ హాలులో ఎగ్జిబిట‌ర్స్ అసోసియేష‌న్ ప్ర‌తినిధులు విజ‌య‌వాడ ఎగ్జిబిట‌ర్స్ అధ్య‌క్షులు సాయిప్ర‌సాద్ ఆధ్వ‌ర్యంలో స‌మావేశ‌మ‌య్యారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ…. నైట్ కర్ఫ్యూ,50 శాతం ఆక్యుపెన్సీ పై చర్చించామ‌న్నారు. 50శాతం ఆక్యుపెన్సీతో అద్దెలు, కరెంట్ బిల్లులు కూడా చెల్లించలేమన్నారు. కర్ఫ్యూ సమయంలో మూడు షోలు మాత్రమే వేయగలమన్నారు. కొత్త సినిమాలు కూడా రిలీజ్ కావడం లేదని, డిస్ట్రిబ్యూటర్ల నుంచి సహకారం లేకపోతే థియేటర్లు నడపడం కష్టమ‌న్నారు. నాలుగు షోలు వేయాలంటే ప్రేక్షకులు ఉదయమే థియేటర్లకు వచ్చే అవకాశం ఉండదన్నారు. టికెట్ ధరలపై తెలుగు ఫిల్మ్ ఛాంబర్ సెక్రెటరీ రమేష్ కీలక వ్యాఖ్యలు చేశారు. 5 రూపాయలు టికెట్ అంటే చాలా మనస్తాపం కలుగుతుందన్నారు. 5 రూపాయలు టికెట్ పెట్టె బదులు టీవీలో సినిమా ఫ్రీగా చూడవచ్చు కదా అన్నారు. రూ.5 లతో ఫ్యాన్ లు, ఏసీలు వేసి థియేటర్లు ఎలా నడుపుతామ‌ని, చాలా మంది ఎమ్మెల్యే లకు థియేటర్లు ఉన్నాయన్నారు. సీఎంతో చెప్పే చనువు ఉన్నా పట్టించుకోవడం లేదన్నారు. కొడాలి నాని సినిమా మనిషి, డిస్ట్రిబ్యూటర్, ఎగ్జిబ్యూటర్ కూడా.. అయినా కొడాలి నాని కి మొత్తం తెలుసన్నారు. ఫిల్మ్ ఛాంబర్ లో ఇంకా మెంబెర్ షిప్ కొనసాగుతుందని, హీరోలు కూడా బాగా క్లోజ్ అయ్యార‌ని, పేర్ని నాని కి కూడా థియేటర్ల గురించి అన్నీ తెలుసు అని, చాలామంది నిర్మాతలు అప్పులు చేసి పైకి షో చేస్తున్నారన్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement