Sunday, May 5, 2024

హాస్ప‌ట‌ల్ లో నిర్మాత‌.. రూ.3ల‌క్ష‌లు సాయ‌మందించిన లారెన్స్

మ‌రోసారి త‌న గొప్ప మ‌న‌సుని చాటుకున్నాడు న‌టుడు..డైరెక్ట‌ర్..కొరియోగ్రాఫ‌ర్ లారెన్స్. అనారోగ్యంతో బాధపడుతూ దీన పరిస్థితిలో జీవితాన్ని నెట్టుకొస్తోన్న ప్రముఖ తమిళ నిర్మాత వీఏ దురైకు రూ.3 లక్షల ఆర్థిక సహాయం అందజేశారు. దురై గతంలో సూర్య, విక్రమ్‌ లాంటి స్టార్‌ హీరోలతో కలిసి పితామగన్‌ (తెలుగులో శివపుత్రుడు) లాంటి సూపర్‌హిట్‌ సినిమాను నిర్మించారు. రజనీకాంత్, విజయకాంత్, సత్యరాజ్ లతో కూడా ఆయన సక్సెస్ ఫుల్ సినిమాలు తీశారు. అయితే రజనీకాంత్ తో తీసిన బాబా సినిమాతో పాటు మరికొన్ని సినిమాలు ప్లాఫ్ కావడంతో పూర్తిగా నష్టాల్లో మునిగిపోయారు. అదే సమయంలో దురై ఆరోగ్య పరిస్థితి కూడా దెబ్బతింది. దీంతో ఆయన గత కొంత కాలంగా చైన్నెలోని ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. తన దీన పరిస్థితిని వివరిస్తూ కొన్ని రోజుల క్రితం ఓ వీడియోను విడుదల చేశారు దురై. దీనికి స్పందించిన హీరోలు రజనీకాంత్, సూర్య తమ వంతు ఆర్థిక సహాయం అందజేశారు. అలాగే డైరెక్టర్‌ వెట్రిమారన్‌ కూడా ఆర్థిక సహాయం అందజేశారు. ఇప్పుడు రాఘవ లారెన్స్‌ దురైను ఆదుకోవడానికి ముందుకువచ్చారు. నిర్మాత పరిస్ధితి గ్రహించిన లారెన్స్ ఆయన వైద్య ఖర్చుల కోసం రూ. 3 లక్షలు ఆర్ధిక సాయం చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement