Friday, April 26, 2024

సినీరంగంపై మహా ప్రభుత్వం వివక్ష చూపుతోంది: కంగ‌న

బాలీవుడ్ హాట్ బాంబ్ హీరోయిన్ కంగ‌న మ‌హారాష్ట్ర ప్ర‌భుత్వంపై మ‌రోసారి విరుచుకుప‌డ్డారు. ఆ రాష్ట్ర ప్ర‌భుత్వం థియేట‌ర్ల‌ను తెర‌వడానికి అనుమ‌తులు ఇవ్వ‌క‌పోవడం స‌రికాద‌ని ఆమె అన్నారు. దేశంలో క‌రోనా తగ్గుముఖం పట్ట‌డంతో అనేక‌ రాష్ట్రాలు థియేటర్లను తెరుచుకునేందుకు అనుమతినిచ్చాయ‌ని ఆమె చెప్పారు. మహారాష్ట్ర ప్ర‌భుత్వం మాత్రం ఇందుకు అంగీక‌రించ‌పోవ‌డం సరికాద‌ని, సినీరంగంపై ఆ రాష్ట్ర స‌ర్కారు వివక్ష చూపుతోందని ఆమె ఆరోప‌ణ‌లు గుప్పించారు. ఇప్ప‌టికే చాలా సినిమాలు విడుదలకు సిద్ధ‌మ‌య్యాయ‌ని ఆమె అన్నారు. థియేటర్లు తెర‌వ‌డానికి ఒప్పుకోకుండా వాటిని పూర్తిగా మూసేయాలని ఆ రాష్ట్ర స‌ర్కారు భావిస్తోంద‌ని ఆరోపించారు. మ‌హారాష్ట్ర పభుత్వం సినీ పరిశ్రమని వివక్షతో చూస్తున్నప్పటికీ దీనిపై ఎవరూ మాట్లాడ‌క‌పోవ‌డం శోచ‌నీయ‌మ‌ని చెప్పారు. కాగా, కంగ‌నా ర‌నౌత్ న‌టించిన‌ ‘తలైవి’ సినిమా విడుద‌ల నేప‌థ్యంలోనూ మ‌హారాష్ట్ర‌లో ప్ర‌భుత్వం థియేట‌ర్ల‌ను తెర‌వడానికి అనుమ‌తులు ఇవ్వ‌లేదు.

ఇది కూడా చదవండి: వైరల్: బార్‌లో నగ్నంగా తిరిగిన మందుబాబు

Advertisement

తాజా వార్తలు

Advertisement