Thursday, March 28, 2024

చంద్రబాబుకు షాక్.. నారావారిపల్లిలో వైసీపీ విజయం

చిత్తూరు జిల్లా నారావారిపల్లిలో టీడీపీకి షాక్ తగిలింది. చంద్రబాబు సొంతూరు నారావారిపల్లిలో ఎంపీటీసీ స్థానాన్ని వైసీపీ కైవసం చేసుకుంది. టీడీపీ ఎంపీటీసీ అభ్యర్థి గంగాధరంపై వైసీపీ అభ్యర్థి రాజయ్య 1347 ఓట్ల తేడాతో విజయం సాధించారు. టీడీపీ అభ్యర్థి గంగాధరానికి కేవలం 307 ఓట్లు మాత్రమే వచ్చాయి. మరోవైపు రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల్లో వైసీపీ అత్యధిక స్థానాల్లో విజయం సాధిస్తోంది.

కాగా ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఫలితాలు వస్తున్న నేపథ్యంలో జిల్లా పరిషత్ ఛైర్మన్, మండల పరిషత్ ఛైర్మన్ల ఎన్నికకు రాష్ట్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్ విడుదల చేసింది. దీంతో ఈ నెల 24న MPPల ఎన్నిక, ఈ నెల 25న జడ్పీ ఛైర్మన్ల ఎన్నికలు జరుగుతాయని SEC నోటిఫికేషన్‌లో పేర్కొంది. ZPTCగా గెలిచిన వారంతా ఛైర్మన్, వైస్ ఛైర్మన్లను.. MPTCలుగా గెలిచిన వారు మండల పరిషత్ అధ్యక్ష, ఉపాధ్యక్షులను ఎన్నుకుంటారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement