Sunday, April 28, 2024

Priyanka : ఆ రెండింటి పైనే ఆశ‌లు..

కోలీవుడ్ లో మంచి గుర్తింపు తెచ్చుకున్న హీరోయిన్ ప్రియాంక అరుళ్ మోహన్ టాలీవుడ్ లో సెన్సేషన్ క్రియేట్ చేయబోతోంది. ఆమె ప్లాన్ సక్సెస్ అయితే ఇది జరగడం పక్కా. గతంలో నేచురల్ స్టార్ నాని సరసన ‘గ్యాంగ్ లీడర్’ చిత్రంతో టాలీవుడ్ కు ఎంట్రీ ఇచ్చింది. కానీ పెద్దగా హిట్ అందుకోలేకపోయింది. ఆ వెంటనే ‘శ్రీకారం’ వచ్చిన హిట్ దక్కించుకోలేకపోయింది. వరుసగా రెండు ఫ్లాప్ లు పడటంతో ఇక తెలుగు సినిమాలకు ఈ ముద్దుగుమ్మ చాలా గ్యాప్ తీసుకుంది. తమిళంలో వరుస పెట్టి సినిమాలు చేసింది.

ప్రియాంక మోహన్ పక్కా ప్లాన్ తో టాలీవుడ్ లోకి వస్తోంది. నానికి జోడీ మరోసారి ప్రియాంక అరుళ్ మోమన్ నటిస్తున్న విషయం తెలిసిందే. వీరి కాంబోలో ‘సరిపోదా శనివారం’ వస్తోంది. ఈ చిత్రం ఆగస్టు 29న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.
అలాగే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ – సుజీత్ కాంబోలో వస్తున్న మోస్ట్ అవైటెడ్ ఫిల్మ్ ‘ఓజీ’ లోనూ ప్రియాంక నటిస్తోంది. ఈ మూవీ సెప్టెంబర్ 27న విడుదల కాబోతోంది. ఈ రెండు సినిమాలపై మంచి అంచనాలు ఉన్నాయి. దీంతో ప్రియాంకకు బ్యాక్ టు బ్యాక్ హిట్లు ఖాయమంటున్నారు. అలాగైతే ఈ ముద్దుగుమ్మ సెన్సేషన్ గా మారడమూ ఖాయమే అంటున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement