Saturday, April 27, 2024

సొంతంగా డబ్బింగ్ చెప్పేస్తానంటున్న ఇస్మార్ట్ బ్యూటీ

ఇటీవల రంగ్ దే సినిమాతో మంచి హిట్ ను అందుకున్నాడు టాలీవుడ్ యంగ్ హీరో నితిన్. ప్రస్తుతం అంధాదున్ రీమేక్ మాస్ట్రో చిత్రంలో నటిస్తున్నాడు. ఇక ఈ సినిమాలో నితిన్ సరసననభా నటేష్ నటిస్తుంది. మరోవైపు మిల్కీ బ్యూటీ తమన్నా కూడా ఈ సినిమాలో నటిస్తోంది. అలాగే బాలీవుడ్ హీరో జాతీయ అవార్డు గ్రహీత ఆయుష్మాన్ ఖురానా కూడా ఈ సినిమాలో నటిస్తున్నారు. మేర్లపాక గాంధీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం జూన్ 11న విడుదల కాబోతోంది.

శ్రేష్ట్ మూవీస్ బ్యానర్‌పై తెరకెక్కుతున్న ఈ చిత్రంకు మహతి స్వర సాగర్ సంగీతం అందిస్తున్నారు. కాగా ఈ సినిమాకు సంబంధించి ఒక అప్డేట్ బయటకు వచ్చింది. ఈ సినిమాలో తన పాత్రకు తానే సొంతంగా డబ్బింగ్ చెప్పుకోవాలని భావిస్తోందట నభా నటేష్. ఈ విషయం గురించి దర్శకుడితో చర్చించానని… ఆయన కూడా అందుకు ఓకే అన్నారని త్వరలోనే దీనిపై నిర్ణయం తీసుకుంటానని చెప్పుకొచ్చింది నభానటేష్.

Advertisement

తాజా వార్తలు

Advertisement