Friday, April 26, 2024

స్నేహితుల మధ్య పుల్లలు పెట్టకండి…30 ఇయర్స్ ఇండస్ట్రీ పృథ్వి

30 ఇయర్స్ ఇండస్ట్రీ పృథ్వి గురించి కొత్తగా పరిచయం చేయనవసరం లేదు. ఎన్నో సినిమాల్లో నటించి మంచి పేరును తెచ్చుకున్నారు. అయితే ఆ తరువాత రాజకీయాల్లో కూడా అడుగు పెట్టి తన మార్క్ చూపించారు. కొన్ని వివాదాల కారణంగా ఎస్వీబీసీ చైర్మన్ పదవిని పోగొట్టుకుని మళ్ళీ సినిమాలు తీయడం మొదలు పెట్టారు. ఓ వైపు సినిమాలు చేస్తూనే… మరోవైపు కొన్ని షో లలో కూడా పాటిస్పేట్ చేస్తున్నారు. అయితే ఇటీవల శ్రీదేవి డ్రామా కంపెనీ షో లో పాల్గొన్న పృథ్వి తన స్నేహితుడు గౌతమ్ రాజు గురించి కొన్ని వ్యాఖ్యలు చేశారు.

అయితే పృథ్వి చేసిన వ్యాఖ్యలు నటుడు గౌతమ్ రాజు గురించి అంటూ సోషల్ మీడియా లో దుమారం రేగింది. దీంతో పృథ్వి క్లారిటీ ఇస్తూ తన స్నేహితుడు గౌతంరాజు గురించి కామెంట్ చేశానని.. నటుడు గౌతమ్ రాజు కూడా తనకు మంచి స్నేహితుడని అయితే నేను ఈ గౌతమ్ రాజు గురించి మాట్లాడలేదని చెప్పుకొచ్చారు. ఇద్దరు మంచి స్నేహితుల మధ్య ఇలాంటి పుల్లలు పెట్టకండి ఓ వీడియోను విడుదల చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement