Saturday, April 20, 2024

ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే అరెస్ట్ చేస్తారా?: చంద్రబాబు

సీఎం జగన్ వ్యవస్థలను నిర్వీర్యం చేస్తున్నారని టీడీపీ అధినేత చంద్రబాబు విమర్శించారు. గుంటూరు జిల్లా పొన్నూరులో మంగళవారం పర్యటించిన ఆయన.. సంగం డెయిరీ కేసు వ్యవహారంలో జైలుకు వెళ్లొచ్చిన ధూళిపాళ్ల నరేంద్ర ఇంటికి వెళ్లారు. ధూళిపాళ్లకు తమ పార్టీ అండగా ఉంటుందని చంద్రబాబు భరోసా కల్పించారు.

వైసీపీ నేతల అక్రమాలు, అవినీతిపై ప్రశ్నించిన వారిని పోలీసులు అరెస్టు చేస్తున్నారని, సోషల్ మీడియాలో కామెంట్ చేసినా వదలట్లేదని చంద్రబాబు మండిపడ్డారు. ప్రజల భావప్రకటన స్వేచ్ఛను హరిస్తున్నారని విమర్శించారు. వైసీపీ నేతల అవినీతిపై కేసులు పెడితే విచారణకు కోర్టులు చాలవని సెటైర్లు వేశారు. పోలీసులు పార్టీ చేతిలో పావులుగా మారొద్దని హితవు పలికారు. చట్టాన్ని ఉల్లంఘించి పనిచేస్తే తీవ్ర పరిణామాలు తప్పవని చంద్రబాబు హెచ్చరించారు.

ఈ వార్త కూడా చదవండి: ఏపీలో వారికి నో వ్యాక్సిన్

Advertisement

తాజా వార్తలు

Advertisement