Saturday, April 27, 2024

మహేష్, చరణ్ కాదంటే వరుణ్‌తో చేశా… శేఖర్ కమ్ముల

అక్కినేని నాగచైతన్య హీరోగా శేఖర్ కమ్ముల దర్శకత్వంలో ఏప్రిల్ 16న ప్రేక్షకుల ముందుకు రాబోతున్న చిత్రం లవ్ స్టోరీ. ఈ సినిమాలో నాగ చైతన్య సరసన టాలెంటెడ్ హీరోయిన్ సాయి పల్లవి నటిస్తోంది. కాగా ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి విడుదలైన పాటలు, లుక్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ముఖ్యంగా సారంగదరియా పాట ట్రెండింగ్ గా మారింది.

ఇదిలా ఉండగా సినిమా రిలీజ్ దగ్గరపడుతున్న నేపథ్యంలో చిత్ర యూనిట్ ప్రమోషన్స్ స్పీడ్ పెంచింది. కాగా ఓ టీవీ ఛానల్ లో ఇంటర్వ్యూలో పాల్గొన్న శేఖర్ కమ్ముల ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఫిదా సినిమా ను గుర్తు చేసుకుంటూ మొదట ఆ స్టొరీ ని మహేష్ బాబుకు చెప్పానని, ఆ తర్వాత రామ్ చరణ్ కూడా చెప్పానని చెప్పుకొచ్చారు. వారిద్దరికి కుదరకపోవడంతో వరుణ్ తేజ్ తో సినిమా చేశానని చెప్పుకొచ్చాడు.

ఇక ఈ సినిమా లో కూడా హీరోయిన్ గా సాయి పల్లవి నటించింది. అప్పట్లో ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఘన విజయం సాధించడంతో పాటు మంచి వసూళ్లను సైతం సాధించింది. అలాగే నటన పరంగా సాయి పల్లవి, వరుణ్ కు మంచి పేరును తీసుకువచ్చింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement