Friday, April 26, 2024

టాలీవుడ్ డైరెక్టర్ తో ధనుష్ పాన్ ఇండియా మూవీ !!

తమిళ్ స్టార్ హీరో ధనుష్ గురించి సినీ అభిమానులకు కొత్తగా పరిచయం చేయనవసరం లేదు. కాగా ధనుష్ నటించిన లేటెస్ట్ చిత్రం జగమే తంత్రం డైరెక్ట్ గా ఓ టి టి లో రిలీజ్ అవుతున్న నేపథ్యంలో సోషల్ మీడియాలో అంత హంగామా నడుస్తోంది. అయితే ఎవరూ ఊహించని విధంగా ఇప్పుడు అనౌన్స్మెంట్ చేసేసాడు ధనుష్.

టాలీవుడ్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల తో ధనుష్ ఓ ప్రాజెక్ట్ చేయబోతున్నాడు. పాన్ ఇండియా లెవెల్ లో ఈ చిత్రం రాబోతుంది. శేఖర్ కమ్ములతో ధనుష్ మూవీ అనగానే ఈ సినిమాపై అంచనాలు ఒక్కసారిగా ఎక్కువయ్యాయి. శేఖర్ కమ్ముల ప్రస్తుతం తీసిన లవ్ స్టోరీ సినిమా రిలీజ్ కి సిద్ధంగా ఉంది. లవ్ స్టోరీ సినిమా నిర్మాతలు ఈ సినిమాని కూడా నిర్మించబోతున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement