Tuesday, May 7, 2024

శంషాబాద్ ఎయిర్‌పోర్టులో విషవాయువు లీక్, ఒకరు మృతి

హైదరాబాద్ శివారులోని శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో విషాదం చోటుచేసుకుంది. ప్లంబింగ్ పని చేస్తుండగా.. పైప్ నుంచి వచ్చిన ఘాటైన యాసిడ్ పొగను పీల్చి ముగ్గురు కూలీలు అస్వస్థతకు గురయ్యారు. అప్రమత్తమైన సిబ్బంది.. బాధితులు నర్సింహారెడ్డి, జాకీర్, ఇలియాస్‌లను వెంటనే ఎయిర్ పోర్ట్‌లోని అపోలో ఆస్పత్రికి తరలించారు. అయితే చికిత్స పొందుతూ నర్సింహారెడ్డి(42) మృతి చెందగా.. మరో ఇద్దరు వ్యక్తులు జాకీర్, ఇలియాస్ ఇంకా ఆస్పత్రిలోనే ట్రీట్‌మెంట్ పొందుతున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement