Saturday, April 27, 2024

ఆదిపురుష్ యూనిట్ లో కరోనా

ఓం రౌత్ దర్శకత్వంలో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా ఆది పురుష్ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఇక ఈ సినిమాలో ప్రభాస్ రాముడిగా కనిపించనున్నాడు. రావణాసురుడిగా బాలీవుడ్ స్టార్ హీరో సైఫ్ అలీఖాన్ కనిపించబోతున్నాడు. ఇక సీత గా కృతి సనన్ నటిస్తోంది. సుమారు 500 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ సినిమా పై భారీ అంచనాలు నెలకొన్నాయి.

అయితే తాజా సమాచారం ప్రకారం ఈ సినిమాకు సంబంధించిన పనులను కొన్ని రోజులపాటు పోస్ట్ పోన్ చేశాడట దర్శకుడు ఓం రౌత్. యూనిట్ లోని ఓ ఇద్దరికి కరోనా రావడంతో ఈ నిర్ణయం తీసుకున్నారట.

Advertisement

తాజా వార్తలు

Advertisement