Wednesday, May 15, 2024

భార్గవ్ కేసుతో సంబంధం లేదంటూ తెరపైకి మరో యువతి

టిక్ టాక్ స్టార్ భార్గవ్ పై పోక్సో చట్టం కింద కేసు నమోదైన సంగతి తెలిసిందే. మాయమాటలు చెప్పి మైనర్ బాలికను గర్భవతిని చేసిన కేసులో భార్గవ్ ను విశాఖ పోలీసులు అరెస్టు చేశారు. అయితే భార్గవ్ అరెస్ట్ గురించి తెలిసిన వెంటనే సోషల్ మీడియాలో మోసపోయిన అమ్మాయి ఈమెనే అంటూ OMG నిత్య అలియాస్ నిత్యశ్రీ ఫోటోలను నెటిజన్లు పోస్ట్ చేశారు.కాగా నిత్య ఈ విషయంపై స్పందిస్తూ… తనకి భార్గవ్ కి ఎటువంటి సంబంధం లేదని..మేమిద్దరం ఏడాది నుంచి కలవలేదని చెప్పుకొచ్చింది.

అయితే ఇప్పుడు తాజాగా మరో యువతి తెరపైకి వచ్చింది. మౌనిక అనే యువతి ఓ వీడియోని విడుదల చేసింది. భార్గవ్ ని కలిసి రెండున్నరేళ్ల అవుతుందని తనకు ఈ కేసుకు ఎలాంటి సంబంధం లేదని మీకు ఈ కేసు గురించి ఎలా తెలుసో నాకు అలానే సోషల్ మీడియా ద్వారా తెలిసిందని తెలిపింది. ‘అమ్మాయి అబ్బాయి’ వీడియోలు ఆపేసి రెండున్నరేళ్ల అయిందని చెప్పుకొచ్చింది. కానీ అప్పటి వీడియోలను ఫోటోలను కొంతమంది సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారని దయచేసి ఆ వీడియోలు అన్నీ డిలీట్ చేస్తారని కోరుకుంటున్నాను అంటూ మౌనిక వీడియో పోస్ట్ చేసింది. కాగా భార్గవ్ వలలో పడి ఇంకా చాలామంది మైనర్ బాలికలు మోసపోయినట్లు ఆరోపణలు వస్తున్నాయి. అయితే అటు పోలీసులు కూడా ఎక్కడ ఈ విషయంపై అధికారికంగా స్పందించలేదు. అలాగే ఎవరూ భార్గవ్ పై ఫిర్యాదు కూడా చేయలేదు.

Advertisement

తాజా వార్తలు

Advertisement