Thursday, May 9, 2024

కెసిఆర్ కు కరోనా లక్షణాలు పోయాయి – లేటెస్ట్ హెల్త్ బులిటెన్

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కు కరోనా పాజిటివ్ నిర్ధారణ అయిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ఫామ్ హౌస్ లో చికిత్స తీసుకుంటున్న కేసీఆర్ కొన్ని పరీక్షల నిమిత్తం యశోద ఆసుపత్రికి వచ్చారు. దీనిపై ముఖ్యమంత్రి వ్యక్తిగత వైద్యుడు ఎం వి రావు స్పందించారు. సీఎంకు సిటీ స్కాన్ చేసాం. ఊపిరితిత్తులలో ఎలాంటి ఇన్ఫెక్షన్ లేదు.

అన్ని నార్మల్ గానే ఉన్నాయి. కరోనా లక్షణాలు అన్నీ కూడా పోయాయి. సీఎం కేసీఆర్ పూర్తిగా ఆరోగ్యంగా ఉన్నారు. త్వరలోనే విధులకు హాజరయ్యే అవకాశం ఉంది. కాగా రక్తపరీక్ష లకు సంబంధించిన ఫలితాలు రేపు వస్తాయి అని పేర్కొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement