Monday, May 20, 2024

Jaggaiahpet – రూ.8.40 కోట్ల నగదు సీజ్‌

ఎన్టీఆర్‌ జిల్లాలో భారీగా నగదు పట్టుబడింది. జగ్గయ్యపేట మండలం గరికపాడు చెక్‌పోస్టు వద్ద తనిఖీలు చేపట్టిన పోలీసులు.. లారీలో తరలిస్తున్న రూ.8.40 కోట్లను సీజ్‌ చేశారు. నగదును హైదరాబాద్‌ నుంచి గుంటూరుకు తరలిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు.

ఈ ఘటనకు సంబంధించి ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు తెలిపారు. ఎన్నికల నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని పోలీసులు హెచ్చరించారు. ఎవరైనా నిబంధనలను మించి నగదు తరలించాలంటే దానికి సరైన ఆధారాలు తప్పకుండా ఉండాల్సిందేనని తెలిపారు

Advertisement

తాజా వార్తలు

Advertisement