Monday, May 20, 2024

AP: నేడు మూడు నియోజకవర్గాల్లో సీఎం జగన్ ప్రచారం…

ఏపీ సీఎం జగన్ ప్రచారంలో దూసుకెళ్తున్నారు. ఓవైపు ప్రముఖ ఛానళ్ల‌కు ఇంటర్వ్యూలు ఇస్తూ… అలాగే బస్సు యాత్రలు చేస్తూ ముందుకు వెళ్తున్నారు. అయితే ఎన్నికల ప్రచారానికి మరో మూడు రోజుల సమయం ఉన్న నేపథ్యంలో ఇవాళ మరో మూడు నియోజకవర్గాల్లో జగన్మోహన్ రెడ్డి ప్రచారం చేయనున్నారు.

మొట్టమొదటగా కర్నూలులో సీఎం జగన్ ప్రసంగం ఉంటుంది. ఆ తర్వాత మధ్యాహ్నం కళ్యాణదుర్గంలో జగన్ ప‌ర్య‌టించ‌నున్నారు. చివరగా రాజంపేటలో బహిరంగ సభ నిర్వహిస్తున్నారు. ఆ సభలో మూడు గంటల సమయానికి సీఎం జగన్మోహన్ రెడ్డి ప్రసంగిస్తారు. ఆ తర్వాత సీఎం తాడేపల్లిగూడెంకి వెళ్తారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement