Sunday, May 19, 2024

TS: బాచుపల్లి గోడ కూలిన ఘటనలో… ఆరుగురు అరెస్ట్

మేడ్చల్ జిల్లా బాచుపల్లి రేణుకా ఎల్లమ్మ కాలనీలో విషాద ఘ‌ట‌న చోటుచేసుకున్న విష‌యం తెలిసిందే. గోడ కూలిన ఘటనలో ఏడుగురు మృతిచెందారు. అయితే ఈ ఘటనలో ఆరుగురిని పోలీసులు అరెస్ట్ చేశారు. భవన నిర్మాణదారుడు అరవింద్ రెడ్డి, సైట్ ఇంజినీర్ సతీష్, ప్రాజెక్ట్ మేనేజర్ ఫ్రాన్సిస్, గుత్తేదారు రాజేష్, మరో ఇద్దరిని పోలీసులు అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసిన ఆరుగురిని పోలీసులు కోర్టులో హాజరు పర్చనున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement