Monday, April 29, 2024

విదేశాలకు వద్దు….నాగ్ !!

కింగ్ అక్కినేని నాగార్జున ప్రస్తుతం ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో ఓ యాక్షన్ ఎంటర్టైనర్ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో నాగార్జున సరసన కాజల్ అగర్వాల్ నటిస్తోంది. అలాగే జబర్దస్త్ యాంకర్ రష్మీ కూడా ఓ కీలక పాత్రలో కనిపించనుంది. అలాగే కరోనా కారణంగా వాయిదా పడ్డ ఈ సినిమా షూటింగ్ జూన్ ఫస్ట్ వీక్ సెకండ్ షెడ్యూల్ ప్రారంభించనుందట. అలాగే సినిమాలో అధిక భాగం విదేశాలలో షూట్ చేయాలని దర్శక నిర్మాతలు ముందు అనుకున్నారట. కానీ కరోనా వ్యాప్తి ఎక్కువగా ఉన్న నేపథ్యంలో ఆ విదేశీ షెడ్యూల్ ను రద్దు చేయాలని నాగార్జున వారికి సూచించాడట.

అందుకోసం ప్రత్యామ్నాయంగా అన్నపూర్ణ స్టూడియోస్ లో సెట్ వేయమని మేకర్స్ ని కోరారట. షూటింగ్ లకు అనుమతి రాగానే అన్నపూర్ణ స్టూడియోస్ లో ఆ సెట్ వేసేందుకు రెడీగా ఉన్నారట చిత్ర యూనిట్. ఇక ఈ సినిమాను నార్త్ స్టార్ ఎంటర్ టైన్మెంట్, శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ ఎల్ పి బ్యానర్లపై నారాయణ దాస్ నారంగ్, రామ్మోహన్ రావు, శరత్ మరార్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement