Friday, April 26, 2024

RRR సంగతి మా రెడ్లు చూసుకుంటారు….30 ఇయర్స్ ఇండస్ట్రీ

ఎన్నికల ముందు వరకు వైసీపీ లో ఓ వెలుగు వెలిగిన నటుడు పృథ్వి కథ మూడు రోజుల ముచ్చట గానే మారిపోయింది. కొన్ని ఆరోపణల కారణంగా తనకి కట్టబెట్టిన పదవిని సైతం కోల్పోయారు. అయితే ఇటీవల ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన పృథ్వి… వైయస్ జగన్, వైఎస్ఆర్ సిపి పార్టీకి తల్లి తండ్రి అని అలాగే సజ్జల రామకృష్ణారెడ్డి, వై.వి.సుబ్బారెడ్డి, విజయసాయిరెడ్డి కుల పెద్దలు, కుటుంబ పెద్దలని.. వారికి ఇష్టం లేకపోవడం వల్లే రాజకీయాల్లో రాణించలేకపోయాను అని చురకలు పెట్టారు. అలాగే రెబల్ ఎంపీ రఘురామకృష్ణంరాజు పై కూడా విమర్శలు చేశారు.

ఆర్ ఆర్ ఆర్ అంటే రాజమౌళి సినిమా అనుకున్నానని ఈ ఆర్ ఆర్ ఆర్ ఎవరో నాకు తెలియదని అన్నారు. మా పార్టీ వాళ్లు ఎలక్షన్ అప్పుడు యాభై ఆరు నియోజకవర్గాల్లో ప్రచారం చేయమన్నారు. వాటిలో భాగంగా నరసాపురం లో కూడా ప్రచారం చేశాను. కానీ ఆర్ ఆర్ ఆర్ గురించి నాకు తెలియదు. ఇక ఈయన సంగతి చూసుకోడానికి కుటుంబసభ్యులు ,పెద్దలు ఉన్నారు. పార్టీ అధిష్టానం ఉంది. జగన్ గారు కూడా ఉన్నారు. వాళ్ళు చూసుకుంటారు. మేమంతా చిన్న పిల్లలం… సజ్జల రామకృష్ణారెడ్డి, వై.వి.సుబ్బారెడ్డి ,విజయ సాయి రెడ్డి ఈ ముగ్గురు రెడ్లు రాజకీయ దురంధరులు. ఆర్ఆర్ఆర్ సంగతి వాళ్ళు చూసుకుంటారని అన్నారు పృథ్వి.

Advertisement

తాజా వార్తలు

Advertisement