Thursday, May 2, 2024

ఆడవాళ్లు మీకు జోహార్లు @ముగ్గురు స్టార్ నటీమణులు

హిట్ ఫ్లాఫ్ లతో సంబంధంలేకుండా వరుస సినిమాలు చేస్తున్నాడు శర్వానంద్. ప్రస్తుతం మహాసముద్రం సినిమాతో పాటు ఆడవాళ్లు మీకు జోహార్లు సినిమాను చేస్తున్నాడు. అయితే ఇందులో శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ బ్యానర్ లో కిషోర్ తిరుమల దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ఆడవాళ్లు మీకు జోహార్లు. ఈ సినిమాలో హీరోయిన్ గా శర్వానంద్ సరసన రష్మీక మందన్న నటిస్తోంది.

అయితే ఈ సినిమాలో మరో ముగ్గురు సీనియర్ నటీమణులు నటిస్తున్నట్లు చిత్ర యూనిట్ ప్రకటించింది. రాధిక, ఖుష్బూ, ఊర్వశి ఈ సినిమాలో ఓ కీలక పాత్రలలో నటిస్తున్నారు. ఈమేర చిత్ర యూనిట్ అధికారిక ప్రకటన చేసింది. లాంగ్ గ్యాప్ తర్వాత ఈ ముగ్గురు సీనియర్ నటీమణులు ఒకేసారి స్క్రీన్ పై ఈ సినిమాలో కనిపించబోతున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement