Wednesday, May 15, 2024

‘యష్’ ని కలిసిన కొత్త జంట

ఐపిఎల్‌లో రియాల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్‌సిబి) తరఫున ఆడుతున్న భారత క్రికెటర్ యుజ్వేంద్ర చాహల్ ఇటీవల తన భార్య ధనశ్రీతో కలిసి బెంగళూరులో ఉన్నారు. కొత్తగా పెళ్లి చేసుకున్న జంట కెజిఎఫ్ స్టార్ యష్, అతని భార్య రాధిక పండిట్‌తో కలిసి ఒక ఖరీదైన హోటల్‌లో కలిశారు. ఈ విషయాన్నీ చాహల్ తన ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ ద్వారా అభిమానులతో పంచుకున్నారు. ఇప్పుడు ఈ పోస్ట్ సోషల్ మీడియా అంతటా వైరల్ అవుతుంది. కాగా అటు యష్ తన రాబోయే చిత్రం కెజిఎఫ్: చాప్టర్ 2 విడుదల కోసం ఎదురు చూస్తున్నాడు. ఈ సినిమా జూలై 16 న ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్ గా రిలీజ్ కానుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement