Thursday, May 9, 2024

పిట్టకథలు అద్భుతమంటోన్న ‘రకుల్..సమంత’

అంథాలజీ సిరీస్ పిట్టకథలులలో నటుల నటన అద్భుతమని కొనియాడారు హీరోయిన్స్ సమంత..రకుల్ ప్రీత్ సింగ్.  ఓటీటీ దిగ్గజం నెట్ ఫ్లిక్స్ రూపొందించిన అంథాలజీ సిరీస్ పిట్ట కథలు. ఈ సిరీస్‌లోని నాలుగు కథలను నలుగురు ప్రముఖ దర్శకులు తెరకెక్కించారు. నాగ్ అశ్విన్, నందిని రెడ్డి, తరుణ్ భాస్కర్, సంకల్ప్ రెడ్డి ఈ సిరీస్‌లోని నాలుగు భాగాలను రూపొందించారు. దీనిలో శ్రుతీ హాసన్, అమలాపాల్, ఈషా రెబ్బ, మంచు లక్ష్మి, సాన్వే మేఘన, జగపతి బాబు, సత్యదేవ్ తదితరులు ప్రధాన పాత్రల్లో నటించారు.  శుక్రవారం నుంచి ఈ సిరీస్ నెట్‌ఫ్లిక్స్ ద్వారా స్ట్రీమింగ్‌కు వచ్చింది. ఈ సిరీస్‌పై ప్రముఖ కథానాయికలు సమంత, రకుల్ ప్రీత్ సింగ్ ప్రశంసలు కురిపించారు. పిట్ట కథలు అందరూ చూడాల్సిన సిరీస్ అని పేర్కొన్నారు. ఈ సిరీస్‌లో మీరా అనే భాగాన్ని డైరెక్ట్ చేసిన నందినీ రెడ్డిపై సమంత ప్రశంసలు కురిపించింది. అలాగే అందులో నటించిన అమలాపాల్, జగపతి బాబును కూడా అభినందించింది. అలాగే ఈ సిరీస్‌లో రాముల భాగంలో నటించిన మంచు లక్ష్మిని కూడా సమంత ప్రశంసించింది. హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ కూడా మంచు లక్ష్మి నటనకు ఫిదా అయింది. మంచు లక్ష్మికి సంబంధించిన వీడియోను ఇన్‌స్టాగ్రామ్ స్టోరీస్‌లో పోస్ట్ చేసింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement