Monday, May 20, 2024

Sivakasi – పటాసుల ప్యాక్టరీలో పేలుడు …. ఎనిమిది మంది మృతి

తమిళనాడులోని ప్రముఖ బాణాసంచా తయారీ పట్టణం శివకాశిలో గురువారం శక్తివంతమైన పేలుడు సంభవించింది. ఇక ఇందుకు సంబంధించిన వివరాల్లోకి వెళితే.. బాణసంచా ఫ్యాక్టరీలోకి ముడిసరుకు లోడ్ చేస్తుండగా ప్రమాదవశాత్తు భారీ పేలుడు సంభవించింది. పేలుడు ధాటికి ఎనిమిది మంది అక్కడికక్కడే మృతి చెందారు. అందులో ఐదుగురు పురుషులు, ముగ్గురు మహిళలు ఉన్నారు.. ఘటన జరిగిన సమయంలో స్థానికులు గమనించి అగ్నిమాపక శాఖకు సమాచారం అందించారు.

- Advertisement -

దాంతో వెంటనే అప్రతమైన అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలికి చేరుకుని మంటలను ఆర్పేందుకు అన్ని ప్రయత్నాలు చేశారు. అయితే మంటలు అదుపులోకి వచ్చినప్పటికీ ప్లాంట్‌ లోని మందుగుండు సామాగ్రి ఎక్కువుగా ఉండడంతో మంటలు చెలరేగుతూనే ఉన్నాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement