Friday, May 10, 2024

తొలి ప్రాధాన్య‌త‌తోనే ప‌ల్లాను గెలిపించండి…మంత్రి పువ్వాడ‌

ఖమ్మం: ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ పార్టీ అభ్యర్థి పల్లా రాజేశ్వర్‌ రెడ్డిని తొలి ప్రాధాన్యతా ఓటుతోనే గెలిపించాలని మంత్రి పువ్వాడ అజయ్‌ అన్నారు. నల్లగొండ-ఖమ్మం-వరంగల్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ నుంచి పోటీచేస్తున్న పల్లా విజయాన్ని కాంక్షిస్తూ ఛాంబర్ ఆఫ్ కామర్స్, గ్రానైట్ యజమాన్యాలతో ఖమ్మంలో సమావేశం నిర్వహించారు. ఇందులో ఎంపీ నామా నాగేశ్వరరావు, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డితోపాటు మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. రెండు, మూడో ప్రాధాన్యతతో పనిలేకుండా మొదటి ప్రాధాన్యతా ఓటుతోనే పల్లా రాజేశ్వర్‌ రెడ్డిని గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. వివిధ పారిశ్రామిక రంగాలకు టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం అనేక సబ్సిడీలు అందించి ఆయా రంగాలను బలోపేతం చేసిన విషయాన్ని గుర్తుచేశారు. ప్రతిపక్షాలు సంధించే ప్రతి ప్రశ్నకు పల్లా గెలుపు ద్వారా సమాధానం లభిస్తుందని చెప్పారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement