Sunday, May 19, 2024

టాప్ లెస్ గా పాప్ సింగర్..

టాప్ లెస్ ఫోజు ఇచ్చిన అమెరికా పాప్ సింగర్ రిహానా. ఆ మ‌ధ్య ఇండియాలో జ‌రుగుతున్న రైతుల ఆందోళ‌నపై ట్వీట్ చేసి సంచ‌ల‌నం రేపిన అమెరికా పాప్ సింగ‌ర్ రిహానా తాజాగా మ‌రో వివాదంలో చిక్కుకుంది. మెడ‌లో గ‌ణేషుడి లాకెట్ వేసుకొని టాప్‌లెస్‌గా ఫొటోల‌కు పోజులిచ్చింది. ఆ ఫొటోను ట్విట‌ర్‌లో షేర్ చేసింది. ఇప్పుడీ ఫొటో దుమారం రేపుతోంది. గ‌తంలో రైతుల ఆందోళ‌న‌కు సంబంధించిన ఫొటోను షేర్ చేస్తూ దీనిపై ఎవ‌రూ ఎందుకు మాట్లాడ‌టం లేదు అని ఆమె ప్ర‌శ్నించింది. దీనిపై బాలీవుడ్‌, క్రికెట్ సెల‌బ్రిటీల‌తోపాటు కేంద్ర ప్ర‌భుత్వం కూడా తీవ్రంగా మండిప‌డింది. ఇది దేశ అంత‌ర్గ‌త వ్య‌వ‌హార‌మ‌ని, అంత‌ర్జాతీయ సెలబ్రిటీలు సంచ‌ల‌నం కోసం ఇలాంటి ట్వీట్లు చేయ‌డం బాగా లేద‌ని ప్ర‌భుత్వం స్పందించింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement