Sunday, May 5, 2024

గుర్తుందా శీతాకాలం టీంతో ‘సుహాసిని’

గుర్తుందా శీతాకాలం టీంతో జాయిన్ అయ్యారు సీనియర్ నటి సుహాసిని.హీరో  సత్యదేవ్, మిల్కీబ్యూటీ తమన్నా హీరోయిన్ గా నటిస్తోన్న చిత్రం ఇది.  నాగ శేఖర్ తెరకెక్కిస్తున్నారు ఎవరైనా సరే.. జీవితంలో సెటిల్ అయిన తర్వాత కొన్ని విష‌యాల్ని ఎప్ప‌టికీ మ‌రిచిపోరు. ముఖ్యంగా టీనేజ్, కాలేజ్ ఆ తర్వాత వ‌చ్చే యూత్ లైఫ్‌లో జ‌రిగే సంఘ‌ట‌న‌లు జీవితాంతం గుర్తుకు వ‌స్తూనే ఉంటాయి. ఇలాంటి ఆహ్లాద‌క‌ర‌మైన సంఘ‌ట‌నలు ప్రేక్ష‌కుల‌కి గుర్తు చేసే ఉద్దేశంతో నాగ‌శేఖ‌ర్ మూవీస్ బ్యాన‌ర్ మీద నాగ‌శేఖ‌ర్, భావ‌న‌ ర‌వి, ఎమ్ ఎస్ రెడ్డి, చిన‌బాబు సంయుక్తంగా గుర్తుందా శీతాకాలం చిత్రాన్ని నిర్మిస్తున్నారు. కన్నడలో విడుదలై సూపర్ హిట్ అయిన లవ్ మాక్ టేల్ ఆధారంగా గుర్తుందా శీతాకాలం చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. మేఘా ఆకాశ్, కావ్యాశెట్టి, ప్రియదర్శి నటిస్తోన్న ఈ చిత్రంలో సీనియర్ స్టార్ సుహాసిని కూడా జాయిన్ అయ్యారు. ఈ విషయాన్ని పోస్టర్ ద్వారా తెలియజేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement