Sunday, May 12, 2024

ముఖేష్ అంబానీకి బెదిరింపులు.. పోలీస్‌ కస్టడీకి నిందితుడు

రిలయన్స్‌ అధినేత ముఖేష్‌ అంబానీ, ఆయన కుటుంబసభ్యులను హత్య చేస్తానంటూ రిలయన్స్‌ ఫౌండేషన్‌ ఆస్పత్రికి బెదిరింపు ఫోన్‌ కాల్స్‌ చేసిన విష్ణువిధుభ్యూమిక్‌ను ఈనెల 20 వరకు పోలీస్‌ కస్టడీకి ఆదేశిస్తూ మంగళవారం ముంబై కోర్టు ఆదేశాలు జారీ చేసింది. బొరివాలి ఏరియాలో విష్ణును ముంబై పోలీసులు సోమవారం అరెస్టు చేశారు. త్రిపురకు చెందిన విష్ణు గత 26 సంవత్సరాలుగా ముంబైలో నివశిస్తున్నాడు. అంబానీకి బెదిరింపు కాల్స్‌ చేయడం వెనుక కారణాలను తెలుసుకోవడానికి పోలీసులు నిందితుడిని పదిరోజుల కస్టడీకి అడగ్గా, కోర్టు ఐదు రోజుల కస్టడీకి ఆదేశాలు జారీ చేసింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement