Saturday, July 27, 2024

AP : సిరా గుర్తు పై త‌ప్పుడు ప్ర‌చారం… ఖండించిన ఈసీ

సోష‌ల్ మీడియాలో ఎన్నిక‌ల సిరా గుర్తు పై జరుగుతున్న త‌ప్పుడు ప్ర‌చారాన్ని ఈసీ ఖండించింది. చెరగని సిరా ఇతరులకు అందుబాటులో ఉందనే ప్రచారం ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికల సమయంలో గుప్పుమంది. ఈ ప్ర‌చారం పై రాష్ట్ర ప్రధాని ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా సీరియస్‌గా స్పందించారు.

- Advertisement -

చెరగని సిరా ద్వారా ఓటర్ల వేళ్లపై వారి ఇంటి వద్దే మార్కు చేస్తూ ఓటు హక్కును విని యోగించుకోకుండా చూడాలనే కుట్ర రాష్ట్రంలో జరుగుతున్నది అంటూ సోషల్ మీడియాలో జరుగుతోన్న దుష్ప్రచారాన్ని ఏపీ సీఈవో ముఖేష్ కుమార్ మీనా ఖండించారు. చెరగని సిరా ప్రభుత్వం మాత్రమే తయారు చేస్తుందని, ఈ సిరా భారత ఎన్నికల సంఘం వద్ద మాత్రమే అందుబాటులో ఉంటుందని, మరెవరికీ ఇది అందుబాటులో ఉండదని స్పష్టం చేశారు. ఈ సిరా భారతీయ ఎన్నికల సంఘం వద్ద కాకుండా ఇతరులు ఎవరికైనా అందుబాటులో ఉంటుందనేది తప్పుడు ప్రచారం అన్నారు. ఎవరైనా ఇతర సిరాల ద్వారా చట్ట వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడితే అటువంటి వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఏపీ రాష్ట్ర ప్రధాని ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా హెచ్చరించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement