Saturday, April 27, 2024

వరుసగా మూడో రోజూ స్టాక్ మార్కెట్ కి న‌ష్టాలు

ముంబయి: దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు వరుసగా మూడో రోజూ నష్టాల్లో ముగిశాయి. సెన్సెక్స్‌ 128.90 పాయింట్లు నష్టపోయి 61,431.74 వద్ద ముగిసింది. నిఫ్టీ 51.80 పాయింట్ల నష్టంతో 18,129.95 దగ్గర స్థిరపడింది. నెస్లే ఇండియా, టీసీఎస్‌, ఎంఅండ్‌ఎం, ఐటీసీ, టైటాన్‌, టాటా మోటార్స్‌, సన్‌ఫార్మా, రిలయన్స్‌ షేర్లు నష్టపోగా.. హెచ్‌సీఎల్‌, విప్రో, ఏషియన్‌ పేయింట్స్‌, భారతీ ఎయిర్‌టెల్‌, ఐసీఐసీఐ బ్యాంకు, ఇండస్‌ ఇండ్‌ బ్యాంకు, యాక్సిస్‌ బ్యాంకు షేర్లు లాభపడ్డాయి. .. ప్రారంభంలో ఆశాజ‌న‌కంగా ర్యాలీ ప్రారంభ‌మైన‌ప్ప‌టికీ ఆ తర్వాత క్ర‌మ క్ర‌మంగా స్టాక్ మార్కెట్లో షేర్లు న‌ష్టాలలోకి జారుకున్నాయి

Advertisement

తాజా వార్తలు

Advertisement