Saturday, May 25, 2024

అనుమానంతో భార్యను హత్య చేసిన భర్త

ఆదోని… అక్రమ సంబంధం పెట్టుకుందనే అనుమానంతో కట్టుకున్న భార్యను గొంతు నులిమి భర్తహత్య చేసిన సంఘటన గత ఒకటవ పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలోని కిలిచిన పేటలో చోటు చేసుకుంది వివరాలు ఇలా ఉన్నాయి ఆదోని పట్టణానికి చెందిన ఉరుకుందుకూతురు శిరీష (23) ను సమీప బంధువైన చంటి కి ఇచ్చి వివాహం చేశారు అయితే వారి వివాహం జీవితం సజావు గా సాగి ఇద్దరుమగ పిల్లలు జన్మించారు అయితే చంటి భార్య శిరీష అక్రమ సంబంధం పెట్టుకుందని అనుమానంతో ఎలాగైనా ఆమెను హత్య చేయాలని నిర్ణయించుకున్నాడు గత శనివారం అర్ధరాత్రి నిద్రించే సమయంలో శిరీష గొంతు నులిమి హత్య హత్య చేసి పోలీస్ స్టేషన్లో లొంగిపోయాడు

శిరీష తండ్రి ఉరుకుందు ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఒకటవ పట్టణపోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు మృతదేహాన్ని ఏరియా ఆసుపత్రికి తరలించి శవ పంచానామా నిర్వహించి కుటుంబీకులకు అప్పగించారు మరిన్ని వివరాలు పోలీసుల విచారణలో తేలాల్సి ఉంది

Advertisement

తాజా వార్తలు

Advertisement