Thursday, May 16, 2024

Tanuku : ఉపాధ్యాయుడి ఆత్మహత్య

ఓ ఉపాధ్యాయుడు ఆత్మ‌హ‌త్య‌కు పాల్ప‌డిన విషాద ఘ‌ట‌న ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రంలోని పశ్చిమగోదావరి జిల్లాలో చోటుచేసుకుంది. జిల్లాలోని తణుకు మాంటిస్సోరి స్కూల్ ఉపాధ్యాయుడు కేఎస్ శివప్రసాద్ ఆత్మహత్య చేసుకున్నాడు. ఉపాధ్యాయుడు హాస్టల్ భవనంలో ఉరి వేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డాడు. శివప్రసాద్ స్వస్థలం కేరళ రాష్ట్రం. గత మూడేళ్లుగా స్కూలులో ఉపాధ్యాయునిగా పనిచేస్తున్నాడు. విషయం తెలుసుకున్న‌ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement