Monday, April 29, 2024

Eluru: అట్రాసిటీ కేసుల నివారణకు కృషి.. విజిలెన్స్ మోనిటరింగ్ కమిటీ మెంబర్

దెందులూరు, ప్రభ న్యూస్ : అట్రాసిటీ కేసుల నివారణకు ఎస్సీ ఎస్టీ విజిలెన్స్ మోనిటరింగ్ కమిటీ, పోలీస్, న్యాయ అధికారులు, సహాయ సహకారాలతో తన వంతు కృషి చేస్తానని ఏలూరు డివిజన్ ఎస్సీ ఎస్టీ విజిలెన్స్ మోనిటరింగ్ కమిటీ మెంబర్ దెందులూరు జడ్పిటిసి నిట్టలీల నవకాంతం అన్నారు.

జోగన్నపాలెంలో విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడుతూ… ప్రజా భాగస్వామ్యం ఎన్జీవోల సహకారంతో అట్రాసిటీ కేసుల నివారణ అవగాహన సదస్సులు, ర్యాలీలు నిర్వహిస్తామన్నారు. అట్రాసిటీ చట్టాలపై ప్రతి గ్రామ శివారు ప్రాంతాల్లో విద్యాసంస్థల్లో విస్తృతంగా అవగాహన పెంపొందించేందుకు ప్రభుత్వ లక్ష్యాలు నెరవేర్చేందుకు కృషి చేస్తామని లీల నవకాంతం తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement