Sunday, April 28, 2024

TDP – ఉండిలో ర‌ఘ‌రామ‌కృష్ణ‌రాజు నామినేష‌న్

ఉండి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి టీడీపీ టికెట్ దక్కించుకున్న నరసాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు నేడు నామినేషన్ దాఖలు చేశారు. ఉండి ఎమ్మార్వో ఆఫీసులో రిటర్నింగ్ అధికారికి తన నామినేషన్ పత్రాలను అందించారు. పెద అమిరం గ్రామంలోని తన నివాసం నుంచి భారీ ర్యాలీతో బయల్దేరిన రఘురామకృష్ణరాజు ఉండి ఎమ్మార్వో ఆఫీసుకు చేరుకున్నారు. ఈ ర్యాలీలో టీడీపీ, జనసేన, బీజేపీ పార్టీల నేతలు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. . . ఈ ర్యాలీలో పశ్చిమ గోదావరి జిల్లా టీడీపీ అధ్యక్షుడు మంతెన రామరాజు కూడా పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement