Friday, April 26, 2024

విశాఖలో విషాదం.. కుక్క పిల్లను కొనివ్వలేదని యువకుడు ఆత్మహత్య

తల్లి తనకు కుక్క పిల్లను కొనివ్వలేదని మనస్తాపం చెంది ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. విశాఖ నగరంలో ఈ విషాద ఘటన జరిగింది. షణ్ముక వంశీ (16) అనే యువకుడు ఇటీవల ఆన్‌లైన్‌లో రూ. 30 వేలు విలువైన ఓ కుక్క పిల్లను చూసి కొనివ్వాలని తల్లిని కోరాడు. కొన్నిరోజుల తర్వాత కొందామని తల్లి చెప్పడంతో మనస్తాపానికి గురయ్యాడు. ఈ క్రమంలో మంగళవారం తల్లి ఇంట్లో లేని సమయంలో గదిలో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర విషాదాన్ని నింపింది. కుమారుడి మృతితో తల్లి రోదించిన తీరు అక్కడి వారిని కంటతడి పెట్టింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement