Thursday, May 2, 2024

సైకో కిల్లర్ గా రాశిఖన్నా ?

హిట్ ఫ్లాప్ లతో సంబంధం లేకుండా వరుస సినిమాలు చేస్తుంది హీరోయిన్ రాశి కన్నా. ప్రస్తుతం నాగచైతన్య థాంక్యూ సినిమాతో పాటు గోపీచంద్ పక్కా కమర్షియల్ సినిమాలో కూడా నటిస్తోంది. అంతేకాకుండా వెబ్ సిరీస్ లో కూడా నటించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇక ఇటీవల ది ఫ్యామిలీ మాన్2 తో మంచి సక్సెస్ ను అందుకుంది సమంత. అయితే సమంత ను పరిచయం చేసిన రాజ్ అండ్ డీకే రాశి ఖన్నా ను అదే తరహాలో డిజిటల్ మీడియా లో పరిచయం చేయబోతున్నారు. ఈ రెండు వెబ్ సిరీస్ లలో ఒకదానిలో షాహిద్ కపూర్ నటిస్తుంటే ..మరొక దానిలో అజయ్ దేవగన్ నటిస్తున్నాడు.

అందులో అజయ్ నటిస్తున్న రుద్ర వెబ్ సిరీస్ లో రాశి కన్నా ఓ సైకో కిల్లర్ గా కనిపించబోతోంది అని తెలుస్తోంది. ఇక అజయ్ దేవగన్ ఓ పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా కనిపించబోతున్నాడట. రాజేష్ ముపుష్కర్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. బ్రిటీష్ వెబ్ సీరిస్లూథర్ ఆధారంగా ఈ వెబ్ సిరీస్ తెరకెక్కనుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement