Thursday, April 18, 2024

ఎమ్మెల్సీ కవితకు మంత్రి కొప్పుల దంపతుల కానుక

టీఆర్ఎస్ ఎమ్మెల్సీ క‌ల్వ‌కుంట్ల క‌విత జ‌గిత్యాల జిల్లా ప‌ర్య‌ట‌న‌లో ఉన్నారు. ఈ సంద‌ర్భంగా ఆమెను త‌మ ఇంటికి ఆహ్వానించిన తెలంగాణ‌ మంత్రి కొప్పుల ఈశ్వ‌ర్ దంప‌తులు ఆమెకు ఆత్మీయ కానుకను అందించారు. ఈ విష‌యాన్ని తెలుపుతూ కొప్పుల ఈశ్వ‌ర్ ట్వీట్ చేశారు. ‘నిజామాబాద్ ఎమ్మెల్సీ క‌విత జ‌గిత్యాల జిల్లా పర్యటనకు వచ్చిన సందర్భంగా కరీంనగర్‌లోని మా నివాసానికి ఆత్మీయంగా ఆహ్వానించి, సంప్రదాయ బద్ధంగా ఆడపడుచు కానుక అందించడం జరిగింది’ అని కొప్పుల ఈశ్వర్ చెప్పారు. చిరున‌వ్వులు చిందిస్తూ ఎమ్మెల్సీ క‌విత మంత్రి కొప్పుల దంపతుల కానుకను స్వీక‌రించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement