Wednesday, May 8, 2024

బీచ్ లో ఫొటోషూట్‌.. ఫొటోగ్రాఫర్‌ గల్లంతు..

అనకాపల్లి జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. జిల్లాలోని అచ్యుతాపురం మండలం తంతడి బీచ్‌లో ఫొటోషూట్‌ చేస్తున్న ఫొటోగ్రాఫర్‌ నీటి ప్రవాహంలో కొట్టుకుపోయాడు. హైదరాబాద్‌కు చెందిన ఫొటో గ్రాఫర్‌ శ్రీనివాస్‌ కొత్త జంటకు ఫొటో షూట్‌ కవరేజ్‌ కోసం అనకాపల్లి జిల్లాకు వెళ్లాడు. ఫొటో షూట్‌ కోసం నీటి ప్రవాహాన్ని గమనించకుండా నీటిలో దిగాడు. దీంతో ఒక్కసారిగా ప్రమాదవశాత్తు నీటి ప్రవాహంలో కొట్టుకుపోయాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని గాలింపు చర్యలు ప్రారంభించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement