Thursday, April 25, 2024

మంచుల‌క్ష్మీ మంచి మ‌న‌సు-50పాఠ‌శాల‌లు ద‌త్త‌త తీసుకున్న న‌టి

తెలంగాణ నిర్వహిస్తున్న మన ఊరు – మన బడి కార్యక్రమంలో భాగంగా న‌టి..నిర్మాత‌ మంచు లక్ష్మి ఏకంగా 50 ప్రభుత్వ పాఠశాలలను దత్తత తీసుకుంది. యాదాద్రి భువ‌న‌గిరి జిల్లాలో 50స్కూల్స్ ని అబివృద్ధి చేస్తామని కూడా ఆమె హామీ ఇచ్చింది. యాదాద్రి జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో జరిగిన ఈ సమావేశంలో టెక్ ఫర్ చేంజ్ సంస్థతో 50 స్కూలు దత్తత తీసుకుంటున్నాను అని ఒప్పందం చేసుకుంది. అంతేకాదు ప్రైవేట్ పాఠశాలలను మరిపించేలా స్మార్ట్ క్లాసెస్ ప్రారంభిస్తామని ఒకటి నుంచి ఐదు తరగతుల వరకు మూడు సంవత్సరాల పాటు స్మార్ట్ క్లాసెస్ నిర్వహిస్తూనే పాఠ్యపుస్తకాలు పంపిణీ చేస్తామని, ఆ స్కూల్స్ లో కనీస అవసరాలు కూడా ఏర్పాటు చేస్తామని ఆమె తెలిపింది. మంచు లక్ష్మి చేస్తున్న మంచి పనికి నెటిజెన్లు సైతం ఆమెను మెచ్చుకుంటున్నారు. అంతేకాదు శభాష్ మేడం అంటూ.. మీలాంటి వ్యక్తులు మన సమాజానికి కావాలి అంటూ ఇలా రకరకాలుగా ఆమెపై ప్రశంసలు వర్షం కురిపిస్తూ ఉండడం గమనార్హం. తండ్రికి త‌గ్గ త‌న‌యురాలంటూ ప్ర‌శంస‌లు కురిపిస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement